ఏవైనా ప్రశ్నలు?    +91 9493475515 | amritanilayam.gowravaram@gmail.com

గురు పరంపర:

  1. శ్రీ కాటంబరీ బాబా, సిద్ధ పీఠం, హిమాలయాలు.
  2. శ్రీ ఘనశ్యామానంద నాథ సరస్వతి, సిద్ధ పీఠం, హిమాలయాలు
  3. శ్రీ రాజరాజేశ్వరానంద నాథ సరస్వతి, సిద్ధ పీఠం, హిమాలయాలు
  4. శ్రీ కళ్యాణానంద భారతి తీర్థ, భద్రకాళి పీఠం, హరిద్వార్
  5. శ్రీ స్వప్రకాశానంద తీర్థ అవధూత, అనకాపల్లి
  6. శ్రీ అమృతానంద నాథ సరస్వతి, సహస్రాక్షి పీఠం, దేవిపురం
  7. శ్రీ అమృతానంద నాథ, అమృత నిలయం, గౌరవరం.

శ్రీ అమృతానంద నాథ

గురువుగారు 1974 సెప్టెంబర్ 19వ తేది వేకువ జామున వినాయక చతుర్థి నాడు  శ్రీమతి కోరిశపాటి హైమావతమ్మ మరియు తిరుపతి రెడ్డి గారి దంపతులకు గౌరవరం గ్రామం, కావలి మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జన్మించినారు. బాల్యము కౌమారము చాలా ఆనందంగా గడిచిపోయాయి, ద్యాస ఉన్నప్పుడు చదువుతూ మిగతా సమయం అంతా స్నేహితులతో గడిపేందుకే ఇష్టపడేవారు. చిన్నప్పటి నుండి ధైర్యంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉట్టిపడుతూ ఉండేవి క్లాసులో లీడర్ గా తరువాత స్కూలు లీడర్ గా ఉంటూ తన స్నేహితులను ముందుకు నడిపించేవారు. స్నేహితులు ఉన్నప్పుడు తప్ప మిగతా సమయం అంతా ఏకాంతంగా ఉండేదానికే ఆసక్తి చూపించేవారు. అలా ఏకాంతంలో ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టేవి, ఆ ఆలోచనల నుండి తనకు తెలియకుండానే మౌనంలోకి జారుకునేవారు, సమయం ఎంతో తెలియకుండా, ఏ ఆలోచనలు లేకుండా, గంటలు రోజులు గడిచిపోయేవి. తను పెద్దవాడై తనకు గురువు వచ్చిన తరువాతే తెలిసింది ఇదే మౌన ద్యానము అని. పూజలు అవి ఏమి తెలియవు కాని ఎప్పుడూ ఏదో ఒక శక్తి తన వెన్నంటే నడిపిస్తుంది అని ప్రగాఢంగా నమ్మేవారు. ఎప్పుడూ గురువులు గురించి హిమాలయ యోగుల గురించిన సమాచారం ఎక్కువగా అందుతూ వుండేది. తను హైదరాబాదులో ఉన్నప్పుడు తన స్నేహితుడు శ్రీ గురు చరిత్ర పుస్తకం ఇచ్చి పారాయణం చేయి అని సలహా ఇచ్చాడు. శ్రీ గురు చరిత్ర 16 పారాయణాలు అయ్యే సరికి తన జీవితంలోకి గురు ఆగమనం జరిగింది.



శ్రీ అమృతానంద నాథ సరస్వతి

శ్రీ అమృతానంద నాథ సరస్వతి గురువుగారు 1934వ సంవత్సరంలో విశాఖపట్నం నందు శ్రీమతి లక్షీనరసమ్మ మరియు శ్రీ నరసింహారావు గారి దంపతులకు జన్మించారు. గురూజీ చాలా చిన్న వయస్సులోనే తన ఆధ్యాత్మిక అన్వేషణను ప్రారంభించాడు. బాల్యంలోనే ఎన్నో దివ్య అనుభవాలను అనుభవిస్తూ నిరంతరం సత్యాన్వేషణలో నిమగ్నమయ్యారు. అనకాపల్లికి చెందిన శ్రీ స్వప్రకాశ నంద అవధూత గురువుగారి నుండి ఆయన శ్రీ విద్యా దీక్షను స్వీకరించారు. అతనికి సరస్వతి దేవి అనుగ్రహం లభించింది, సరస్వతి అనే దీక్షా నామం ఇవ్వబడింది. గురూజీకి పదహారేళ్ల బాలికగా దేవి దర్శనం లభించింది. ఆమె ఆశీస్సులతో, అతను 1984లో కొండపై కామాఖ్య పీఠాన్ని మరియు శిఖరంపై ఆనందభైరవీభైరవుల ఆలయాన్ని నిర్మించారు. తరువాత శ్రీచక్ర రూపంలో శ్రీమేరు ఆలయాన్ని నిర్మించారు, ఈ ఆలయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో వివరించిన విధంగా అందరి దేవతా విగ్రహాలు ఉన్నాయి. కుల, మత భేదాలు లేకుండా భక్తులు స్వయంగా దేవికి పూజలు చేసుకునేందుకు అనుమతించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. శ్రీ అమృతానంద నాథ సరస్వతి గురువుగారు  అక్టోబరు 2015లో మహా సమాధి చెందారు.




శ్రీ స్వప్రకాశానంద

శ్రీ స్వప్రకాశనంద తీర్థ అవధూత గురువుగారు 1915లో ఆంధ్ర ప్రదేశ్‌లోని విదుర్బర్తి అనే చిన్న గ్రామంలో జన్మించారు. గురువుగారు దత్తాత్రేయ పరంపరకు చెందినవారు ఈయన ఎటువంటి విద్యను అభ్యసించలేదు, అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహంతో, వేదాలు, శాస్త్రాలలో అపారమైన జ్ఞానం, మరియు సంస్కృతంలో మంచి ప్రావీణ్యం పొందారు. తన ఇరవయ్యో ఏట భారతదేశంలోని అత్యుత్తమ ఆధ్యాత్మిక గురువులతో పరిచయం ఏర్పడింది. టిబెటియన్ గురువు మారు మహర్షి శిష్యుడైన శ్రీ పూర్ణానంద యోగి నుండి ఆయన దీక్షను స్వీకరించారు. మధ్వాచార్య సంప్రదాయానికి చెందిన శ్రీ కేసరి కామేశ్వరరావు ద్వారా శ్రీ విద్యా ఉపాసనతో పరిచయం ఏర్పడింది. తన 32వ ఏట శ్రీ రాజరాజేశ్వరి, వనదుర్గ, సప్తశతి చండీ మహా విద్యలలో దీక్షను స్వీకరించారు. అనకాపల్లికి చెందిన శ్రీ జ్ఞానానంద సరస్వతి నుండి దీక్షను స్వీకరించారు. తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవడానికి భారతదేశం అంతా పర్యటించాడు. తను 40 సంవత్సరాల వయస్సులో, ఒరిస్సా మరియు రాజమండ్రి నుండి 64 తంత్రాలలో ప్రావీణ్యం సంపాదించాడు. 43 సంవత్సరాల వయస్సులో, తను 18 పీఠాలు మరియు అనేక మంది గురువుల బోధనల నుండి 7 కోట్ల మంత్రాలను నేర్చుకున్నాడు. కాశీలో కొన్నాళ్ళు గడిపి తను నేర్చుకున్న మంత్రాల మూలాలు గురించి ఆలోచిస్తూ, విశ్లేషించాడు. విశాఖపట్నం లలితా




శ్రీ కళ్యాణానంద భారతి తీర్థ

శ్రీ కళ్యాణానంద భారతి తీర్థ గురూజీ దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. 1945లో తన గురువు శ్రీ రాజరాజేశ్వరానంద నాథ ద్వారా శ్రీ విద్యా ఉపాసనలో దీక్షను పొందారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆయనకు మంచి పట్టు ఉండేది. గురూజీ గంగా నది ఒడ్డున ఉన్న హరిద్వార్‌లో స్థిరపడ్డాడు. హరిద్వార్‌లోని సప్త ఋషి సరోవర్‌లో భద్రకాళి పీఠాన్ని స్థాపించాడు. గురూజీ 1998లో మహా సమాధి పొందారు.